|
|
by Suryaa Desk | Tue, Apr 28, 2026, 01:54 PM
ఖమ్మం నగరంలోని ధంసలాపురం రైల్వే వంతెన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో భాగంగా జరుగుతున్న ఈ పనులను ఆయన నేషనల్ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు నాణ్యతగా, వేగంగా పూర్తయితే గ్రీన్ ఫీల్డ్ హైవే రవాణాకు పూర్తిగా అనుకూలంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ, మేయర్ నీరజ పాల్గొన్నారు.
Latest News