|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 10:37 AM
AP: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ విశాఖపట్నంలో తన క్యాంపస్ నిర్మాణ పనులను ప్రారంభించింది. మధురవాడలో 22.19 ఎకరాల భూమిని ప్రభుత్వం 99 పైసలకే కేటాయించింది. ఈ నూతన క్యాంపస్లో 13 అంతస్తుల ఐటీ టవర్, 4 పోడియంలు నిర్మించబడతాయి. ప్రస్తుతం రుషికొండ ఐటీ పార్క్లోని మహతి భవనంలో తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ, భవిష్యత్తులో పలు దశల్లో 25వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
Latest News