|
|
by Suryaa Desk | Sat, May 02, 2026, 10:38 AM
బాపట్లలోని శ్రీ క్షీర భావన్నారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన దివ్య రథోత్సవం శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో వేలాది మంది భక్తులు, ప్రజా ప్రతినిధులు, బాపట్ల జిల్లా కలెక్టర్, పోలీస్ అధికారులు, మునిసిపల్, రెవిన్యూ అధికారులు, వారి సిబ్బంది పాల్గొన్నారు. పురవీధులు భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
Latest News