by Suryaa Desk | Thu, Jul 11, 2024, 03:01 PM
రాజ్ తరుణ్, లావణ్య మధ్య వివాదం మలుపులు తిరుగుతోంది. ఆమె ఫిర్యాదుతో నిన్న రాజ్పై కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తాజాగా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేశారు. రాజ్ తనను పెళ్లి చేసుకుని మోసం చేసి, మాల్వీకి దగ్గరయ్యాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ కలిసి తనను డ్రగ్స్ కేసులోనూ ఇరికించారని ఆరోపించారు. రాజ్, మాల్వీ ‘తిరగబడరా సామి’ మూవీలో నటించారు.
Latest News