మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం తిమ్మయ్యపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి బకెట్లో పడి 13 నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళితే.. తిమ్మయ్యపల్లి గ్రామానికి చెందిన కురుమూర్తి, అరుణమ్మలు దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు సాయి, 13 నెలల కుమార్తె (ఇంకా పేరు పెట్టలేదు) ఉన్నారు. బుధవారం సాయంత్రం తల్లి వంటపాత్రలు కడగటానికి బకెట్లో నీటిని నింపి ఇంటి ఆవరణలో పెట్టింది. పాత్రలు కడిగిన తర్వాత.. వాటిని ఇంట్లో పెట్టడానికి వెళ్లిన ఆమె పనిలో పడి బయట ఆడుకుంటున్న కుమార్తెను మరచిపోయింది.
కాసేపటికి అరుణమ్మ బయటకు వచ్చి చూడగా.. కూమార్తె కనిపించలేదు. బకెట్ వద్దకు వెళ్లి చూడగా.. తలకిందులుగా అందులో పడిపోయి కనిపించింది. చిన్నారిని బయటకు తీసి చూడగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తన కూతురుని చేజేతులా చంపుకున్నాని తల్లి రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa