విదేశాల్లో చదవాలనుకునేవారికి ఇది నిజంగా గుడ్న్యూస్. ఎందుకంటే రాష్ట్రంలో విదేశీవిద్య పథకాన్ని మరింత ఎక్కువ మంది విద్యార్థులకు వర్తింపజేసి.. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అవకాశాలు కల్పించాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు విదేశీవిద్య అవకాశాల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వానికి సంక్షేమశాఖలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాయి. బీసీ సంక్షేమశాఖ పరిధిలో ప్రస్తుతం 300 మందికి విదేశీ విద్య అవకాశాలు కల్పిస్తుండగా.. 3,000 మందికి, ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో 250 మంది నుంచి 500 మందికి, మైనార్టీలో 500 మంది నుంచి 1,000 మందికి అవకాశాలు పెంచాలని సంక్షేమ శాఖ నివేదిక పంపింది.
ప్రస్తుతం లోక్సభ ఎన్నికల కోడ్ ఉన్నందున.. కోడ్ ముగిసిన తరువాత దీనిపై ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. విదేశీవిద్య పథకం కింద అర్హులైన విద్యార్థులకు సంక్షేమశాఖలు రూ.20 లక్షల స్టైఫండ్ మంజూరు చేయడంతోపాటు విమాన ఖర్చులు భరిస్తున్నాయి. ఇప్పటికే ఫారెన్లోని వివిధ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందినవారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ పథకం ప్రవేశపెట్టినపుడు అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. గత రెండేళ్లుగా భారీ సంఖ్యలో అప్లికేషన్స్ వస్తున్నాయి. దరఖాస్తుదారుల మార్కులు, ఇంగ్లీష్ ప్రావీణ్య స్కోరు, చదవాలనుకుంటున్న కోర్సు, దేశం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమశాఖలు అఫ్లికేషన్లు వడపోస్తున్నాయి. సంక్షేమశాఖల వారీగా రాష్ట్రస్థాయి కమిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి.. అర్హులను ఎంపిక చేస్తున్నాయి.
ఇంజనీరింగ్ చేయడానికి టాప్ దేశాలు ఇవే
ప్రస్తుత సీజన్కు అప్లికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీవిద్య పథకం కింద 2023 స్ప్రింగ్ సీజన్కు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 5 వరకు గడువు ఇవ్వగా అది ముగుసింది. అర్హుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని సంక్షేమ శాఖఅధికారులు వెల్లడించారు. బీసీ సంక్షేమశాఖ పరిధిలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నప్పటికీ.. ఏటా కేవలం 300 మందికి మాత్రమే ప్రస్తుతం పథకం కింద లబ్ధి చేకూరుతోంది. ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలో అంబేడ్కర్ విదేశీవిద్య పథకం కింద దరఖాస్తుల గడువు మార్చి 31తో ముగిసింది. సరైన పత్రాలు లేకపోవడం తదితర కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయామని, గడువు పెంచాలని ఎస్సీ సంక్షేమ శాఖాధికారులకు కొందరు అభ్యర్థులు వినతిపత్రాలు అందిస్తున్నారు.
మైనార్టీ సంక్షేమశాఖలోనూ అఫ్లికేషన్ల గడువు ముగిసింది. ఈ శాఖ పరిధిలో ఏటా 500 మందికి విదేశీవిద్యకు సర్కారు అవకాశం లభిస్తోంది. వచ్చిన దరఖాస్తులను వడపోసి.. తుది ఎంపికలు పూర్తి చేసేనాటికి మరో రెండు నెలల సమయం పడుతుందని సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa