ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్‌వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు, కేజీ ఎంతంటే..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 08, 2024, 05:56 PM

నాన్‌వెజ్ ప్రియులకు నిజంగా ఇది షాకింగ్ న్యూసే. ఎందుకంటే చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ఈనెల ప్రారంభంలో రూ. 160 -200 ఉన్న ధరలు ప్రస్తుకం అమాంతం పెరిగాయి. కేజీ చికెన్ ప్రస్తుతం రూ. 300 వరకు పలుకుతోంది. దీంతో మధ్య తరగతి ప్రజలు చికెన్ కొనేందుకు జంకుతున్నారు. కోడిగుడ్లతోనే సరిపెట్టుకుంటున్నారు. కొందరికి ముక్కలేనేది ముద్ద దిగదు. సండే వచ్చిందంటే చాలా కచ్చితంగా నాన్‌వెజ్ ఉండాల్సిందే. అలాంటి వారు గతంలో కేజీ కొంటే ప్రస్తుతం అరకేజీతో సరిపెట్టుకుంటున్నారు. అంతంత ధరలు పెట్టి కొనలేక.. తినాలనే కోరికను చంపుకోలేక ఏదో అరకేజీతోనో.. పావుకేజీతోనో సరిపెట్టుకుంటున్నారు.


 ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ వేడిమి తట్టుకోలేక పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లు చనిపోతున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్లు, రంజాన్‌ నేపథ్యంలో హలీమ్ తయారీకి ఎక్కువగా చికెన్‌ వాడటం వల్ల డిమాండ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం రూ. 300 ఉన్న చికెన్‌ ధర రానున్న రోజుల్లో రూ.350 వరకు పెరిగే అవకాశముందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.


వేసవిలో అధిక ఉష్ణోగ్రతతో కోళ్లు చనిపోతుంటాయని.. సప్లయ్‌ అంతగా లేకపోవడంతో డిమాండ్‌ పెరిగి ధరలు పైకి పోతుంటాయని పౌల్ట్రీ వ్యాపారులు అంటున్నారు. ప్రతి ఏడాది వేసవిలో ఇది సహజమే అని అంటున్నారు. వాతావరణం చల్లబడ్డ తర్వాత కోళ్ల ఉత్పత్తి పెరిగి ధరలు దిగి వస్తాయిని అంటున్నారు. పెరిగిన ధరలతో సామాన్యులే కాకుండా వ్యాపారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చికెన్ కొనేవారు లేక వ్యాపారం తగ్గిందని అంటున్నారు. గతంలో సగటున రోజుకు 100 కేజీల చికెన్ విక్రయిస్తే ప్రస్తుతం 50 కేజీలకు పడిపోయిందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa