ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటు వేస్తూ సెల్ఫీ,,,ఓటరుపై కేసు నమోదు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 13, 2024, 09:17 PM

సెల్పీ పిచ్చి పోలింగ్ కేంద్రాలలో కూడా కనిపించింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఓటు వేస్తూ ఫొటో తీసుకున్న ఓ ఓటరుపై కేసు నమోదయింది. జగిత్యాల జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తిలో జయరాజ్ అనే ఓటరు ఓటు వేస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఎన్నికల అధికారి ఫిర్యాదు మేరకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలో రెండు చేతులు లేని దివ్యాంగుడు అజ్మీరా రవి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఎన్నికల సిబ్బంది అతని కాలి వేలికి సిరా గుర్తు వేశారు. రెండు చేతులు లేకున్నా బాధ్యతతో ఓటు వేయడానికి వచ్చిన రవిని అందరూ అభినందించారు.


5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్


తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదయింది. అత్యధికంగా భువనగిరిలో 72.34 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.1 శాతం పోలింగ్ నమోదయింది. మల్కాజ్‌గిరిలో 46.27 శాతం, సికింద్రాబాద్‌లో 42.48 శాతం, జహీరాబాద్‌లో 71.91 శాతం, మెదక్‌లో 71.33 శాతం, ఖమ్మంలో 70.76 శాతం ఓటింగ్ నమోదయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa