హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మొన్న రాత్రి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఇక నిన్నటి నుంచి ఎండలు తగ్గాయి. ఇవాళ ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉంది. నగర పరిధిలోని మియాపూర్, చందానగర్, శేరిలింగంపల్లి, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు నగరమంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సంగారెడ్డిలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వాన దంచికొట్టింది. పటాన్చెరులో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 6 గంటల లోపు మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.ఈ నెల 23వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa