తెలంగాణను డ్రగ్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అందుకు ప్రత్యేకంగా పోలీసు వింగ్ను ఏర్పాుట చేసింది. అయినా పోలీసుల కళ్లుగప్పి కొందరు కేటుగాళ్లు మత్తు పదార్థాలు అక్రమ రవాణా చేస్తున్నారు. అందుకు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా.. ఇలా కూడా చేస్తారా? అని ఆశ్చర్యపోయేలా అక్రమ రవాణాల చేస్తున్నారు. తాజాగా..అలా డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ ఓ కేటుగాడు పోలీసులకు చిక్కాడు.
ఆన్లైన్ ద్వారా హెరాయిన్ మత్తు పదార్ధాని సరఫరా చేస్తున్న ముఠాలోని ఓ నిందితుడిని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద రూ.4 లక్షల విలువైన 33 గ్రాముల హెరాయిన్ను సీజ్ చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని సంచార్ జిల్లా సర్వన గ్రామానికి చెందిన దినేష్ కుమార్ నాలుగు నెలల కిందట హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఎల్బీనగర్ సమీపంలోని సెంట్రల్ బ్యాంక్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ స్టీలు రెయిలింగ్కు చెందిన వెల్డింగ్ పనులు చేస్తున్నాడు.
స్వస్థలం నుంచి వచ్చిన ఇతని అన్న సురేష్తో పాటు మనోజ్ బిష్ణోయ్, దినేష్ కల్యాణ్, భన్వర్లాల్లతో గ్యాంగ్ ఏర్పాటు చేశాడు. వీరంతా డ్రగ్స్కు అలవాటుపడిన కస్టమర్ల నుంచి ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొనేవారు. ఆ తర్వాత ఆన్లైన్లోనే హెరాయిన్ సప్లయ్ చేసేవారు. దినేష్ కుమార్ తరచూ రాజస్థాన్కు వెళ్లి హెరాయిన్ తీసుకువచ్చవాడు. ఒక్కో గ్రాము చొప్పున ప్యాకెట్లలో నింపి వాటిని స్టీలు పైపుల్లో ఉంచి కనిపించకుండా రోలింగ్ కవర్తో జాగ్రత్తగా ప్యాక్ చేసేవాడు. రాజస్థాన్లోనే ఉంటున్న మిగతా నలుగురూ హైదరాబాద్కు చెందిన కస్టమర్లతో ఆన్లైన్ ద్వారా ట్రాన్సక్షన్ నడిపేవారు.
వారు పంపుతున్న కస్టమర్ లొకేషన్కు దినేష్ కుమార్ హెరాయిన్ ప్యాకెట్లను పంపించేవాడు. ఈ పైపులేంటని ర్యాపిడో సిబ్బంది అడిగినా.. కస్టమర్లకు శాంపిల్ పైపులు పంపుతున్నానని నమ్మబలికేవాడు. పక్కా సమాచారం మేరకు నిఘా ఉంచిన పోలీసులు.. మన్సూరాబాద్ వద్ద బైక్పై వెళుతుండగా పట్టుకున్నారు. బైక్ ట్యాంక్ కవరులో స్టీలు పైపుల్లో దాచిన హెరాయిన్ను సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa