ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌లో మరో ప్రీ-లాంచ్ ఆఫర్ మోసం.. కస్టమర్ల నుంచి రూ. 80 కోట్లు వసూళ్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 18, 2024, 07:45 PM

హైదరాబాద్‌లో మరో ప్రీ-లాంచ్ ఆఫర్ మోసం వెలుగులోకి వచ్చింది. భారతీ లేక్‌వ్యూ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంలో భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు, ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావులను అరెస్టులు అరెస్టు చేశారు. కొంపల్లిలో భారతీ లేక్‌వ్యూ ప్రీ-లాంచ్ పేరుతో భారీగా వసూళ్లు చేసినట్లు గుర్తించారు. అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ 350 మంది నుంచి రూ.80 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. డబ్బులు వసూలు చేసినా నిర్మాణం చేపట్టలేదు. దీంతో బాధితులు పోలీసులు ఆశ్రయించగా.. కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


వివరాల్లోకి వెళితే.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలోని భారతి లేక్ వ్యూ పేరుతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. ప్రీ-లాంచ్ ఆఫర్ అంటూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. 6.23 ఎకరాల్లో తమ సంస్థ నిర్మాణం చేపడుతుందని చెప్పారు. చదరపు అడుగు రూ. 3,200కే అంటూ ఆకర్షణీయమైన ధరతో ఫ్లాట్‌లను ప్రచారం చేశారు. రంగురంగుల బ్రోచర్‌లను పంపిణీ చేశారు. కొంపల్లిలోని వెంచర్ సైట్‌తో పాటు మాదాపూర్‌లోని ఆఫీసుల్లో కస్టమర్లతో సమావేశాలు నిర్వహించి వారిని నమ్మించారు.


దాదాపు 350 మంది కస్టమర్ల నుంచి రూ. 80 కోట్లకు పైగా వసూలు చేశారు. ఆ తర్వాత ఆ 6.23 ఎకరాల భూమిని రూ.100 కోట్లకు మరో పార్టీకి విక్రయించారు. విషయం తెలుసుకున్న బాధితులు.. తాము మోసపోయామని భావించి పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు . తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్-1999లోని చీటింగ్, సెక్షన్ 5 కింద కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa