ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీచర్ బదిలీని ఆపాలని యంఈఓకు వినతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 03:02 PM

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు శ్రీనివాసులు బదిలీ నిలిపివేయాలని కోరుతూ గ్రామస్తులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు గురువారం మల్దకల్ ఎంఈవో సురేష్ కు వినతి పత్రం సమర్పించారు. శ్రీనివాసులు తమ గ్రామంలో పనిచేస్తూ అనేకమంది పిల్లలను బడికి వచ్చేలా కృషి చేశారని తెలిపారు. ఇలాంటి ఉపాధ్యాయుడు తాము వదులుకోబోమని తల్లితండ్రులు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa