ప్రయాణికులకు తరచూ ఏదో ఓ ఆఫర్ ప్రకటించే టీజీఎస్ ఆర్టీసీ.. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తులకు కూడా అధిరిపోయే ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరలపై ఏకంగా పది శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అయితే... ఈ ఆఫర్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భక్తులకు కాదండోయ్. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధి నుంచి తిరుపతి వెళ్లే భక్తులకు మాత్రమే వర్తించనుంది. ఉమ్మడి నల్గొండ రీజియన్ నుంచి తిరుపతికి సూపర్ లగ్జరీ బస్సుల్లో వెళ్లే భక్తులు.. అప్ అండ్ డౌన్ ఒకేసారి రిజర్వేషన్ చేయించుకుంటే.. బస్ టికెట్లపై పది శాతం డిస్కౌంట్ పొందొచ్చని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు.. నల్గొండ రీజనల్ మేనేజర్ ఎం. రాజశేఖర్ తెలిపారు. ఈ సదావకాశాన్ని ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఇలాంటి ఆఫర్లు టీజీఎస్ ఆర్టీసీ.. గతంలోనూ చాలా వరకు ప్రకటించిన విషయం తెలిసిందే. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో.. తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఇలాంటి ఆఫర్ను ఆర్టీసీ ప్రకటిస్తూ ఉంటుంది. కాగా.. ఇప్పుడు నల్గొండ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల కోసం ప్రకటించటం గమనార్హం.మరోవైపు.. టీజీఎస్ ఆర్టీసీ కొత్తగా రకరకాల బస్ పాస్లను కూడా తీసుకొచ్చింది. ఇందులో భాగంగా.. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు తరచూ బస్సుల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని కొత్తగా బస్ పాస్ను తీసుకొచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. ఈ మార్గంలో పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ను సంస్థ ప్రవేశపెట్టింది. 5 వేల రూపాయలుగా ఈ బస్ పాస్ ధరను నిర్ణయించగా.. దీనితో కేవలం పుష్పక్ ఏసీ బస్సులే కాకుండా హైదరాబాద్ నగరంలోని ఇతర అన్ని బస్సుల్లోనూ ప్రయాణించే ఛాన్స్ ఉంటుంది.
మరోవైపు.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి.. ఆర్టీసీలో ప్రయాణించేవారి సంఖ్య ఘనణీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. రోజుకు ఏకంగా 20 లక్షల మంది ప్రయాణికులు తన ప్రయాణాలు సాగిస్తున్న విషయాన్ని సంస్థ పంచుకుంది. అందులో 70 శాతం మహిళలే ఉండటం గమనార్హం. అయితే.. ఫ్రీ బస్ సౌకర్యం కేవలం.. ఆర్డీనరీ బస్సులు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే ఉండగా.. అవన్నీ మహిళలలో ఫుల్ అయిపోతున్నాయి. దీంతో.. పురుషులంతా లగ్జరీ, సుపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. అలా.. నిత్యం ప్రయాణాలు సాగించే వారికి కూడా ఇప్పటికే.. టీజీఎస్ ఆర్టీసీ మంత్లీ బస్ పాస్ విధానాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa