ట్రెండింగ్
Epaper    English    தமிழ்

3,100 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం: మంత్రి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2024, 01:11 PM

2,800 నుంచి 3,100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్లు అధికారుల సమీక్షలో తేలిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ’వాటిని నిషేధిత జాబితాలో పెట్టించి నిలిపివేయించా. దీనిపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై చర్యలుంటాయి. కొన్ని స్థలాల్లో ఏమీ లేకున్నా ఇల్లో, షెడ్డో ఉన్నట్లు నివేదిక ఇప్పించి, వారి పేరుపైకి మార్చేశారు. ఇలా లెక్కకు మిక్కిలి అక్రమాలు జరిగాయి. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే ఇలాంటి 32 ఎకరాలను గుర్తించాం. వీటి విలువ రూ.2800 కోట్ల వరకు ఉంటుంది‘ అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa