ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భద్రాద్రి రాముడి భూములకు రక్షణ కరువు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 17, 2024, 04:26 PM

భద్రాద్రి ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు.. అడ్డుకున్న ఆలయ ఈవో, సిబ్బందిపై కర్రలతో దాడి చేసిన ఆక్రమణదారులు.భద్రాద్రి కొత్తగూడెం - బూర్గంపహాడ్, భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఆక్రమణలు ఆగడంలేదు. సరిహద్దున ఆంధ్రాలోని పురుషోత్తపట్నంలో ఉన్న ఆలయ భూముల్లో కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను ఆలయ ఈవో, అధికారులు అడ్డుకున్నారు.. అయితే వీరిపై ఆక్రమణదారులు కర్రలతో దాడులు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామాలయ భూములకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అక్రమ కట్టడాలను మాత్రం ఆక్రమణదారులు ఆపడంలేదు. 1970 నుంచి 2022 వరకు ఏపీ హైకోర్టుతోపాటు స్థానిక, జిల్లా, ఎండోమెంట్ ట్రైబల్ సెటిల్మెంట్ కోర్టులు, తెలంగాణ హైకోర్టు దేవస్థానానికి అనుకూలంగానే ఉత్తర్వులు ఇచ్చాయని ఆలయ ఈవో తెలిపారు. అయినప్పటికీ ఈ ఆక్రమణలు మాత్రం రోజురోజుకు పెరిగి పోతున్నాయని అన్నారు.సదరు భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని రెండు నెలల క్రితమే ఏపీ రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సూచించారు. అయినప్పటికీ 50 శాతం నిర్మాణాలు పూర్తిచేశారు. తహసీల్దార్ ఆదేశాలను సైతం ఆక్రమణదారులు లెక్క చేయడం లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa