మరో మూడ్రోజుల్లో హైదరాబాద్ లో గణేశ్ మహా నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను ఆమ్రపాలి వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 73 పాండ్స్, 5 పెద్ద చెరువుల వద్ద నిమజ్జన కేంద్రాల ఏర్పాటు
73 పాండ్స్ లో 27 బేబీ పాండ్స్, 24 పోర్టబుల్ పాండ్స్, 22 ఎస్కలేటర్ పాండ్స్ ఏర్పాటు
జీడిమెట్ల ఫాక్స్ సాగర్, బహుదూర్ పురా మీరాలం చెరువు, సరూర్ నగర్ పెద్ద చెరువు, కాప్రా ఊర చెరువులో నిమజ్జనానికి ఏర్పాట్లు
అందుబాటులో 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 36 ట్రాన్స్ పోర్టు క్రేన్లు
125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ లు, 308 మొబైల్ టాయిలెట్స్, 52,270 టెంపరరీ వీధి లైట్లు ఏర్పాటు
నిమజ్జనం సందర్భంగా 160 గణేశ్ యాక్షన్ టీమ్స్ తో సేవలు
పలు చోట్ల అన్నపూర్ణ భోజన కేంద్రాల ఏర్పాటు
అన్ని నిమజ్జన కేంద్రాల వద్ద త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన
24 గంటలూ అందుబాటులో అధికారులు
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమ్రపాలి చెప్పారు. ఇవాళ రాష్ట్ర డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తో కలిసి ఆమె నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగానే పై వివరాలు తెలిపారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa