ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎంకు అరుదైన గౌరవం.. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 15, 2024, 07:27 PM

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి విక్రమార్కకు ఆహ్వానం లభించింది. మెక్సికోలోని మోంటిగ్రో నగరంలో సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న ఈ నోబెల్ శాంతి శిఖారాగ్ర సమావేశాలకు భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది. అయితే.. 19వ తేదీన జరిగే ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. "ప్రగతి కోసం శాంతి" అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి.


ఈ 200వ వేడుకల్లో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదులు.. సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో తెలిపారు. ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి.. కార్యాచరణ, వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశంలో రూపొందిస్తామని ఆహ్వాన పత్రికలో పేర్కొనటం గమనార్హం. ఈ సమావేశాల్లో పాల్గొనాలని ఆహ్వానం అందటంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆహ్వానం అందటం.. తనకు ఎంతగానో గర్వకారణమని చెప్పుకొచ్చారు.


ఇదిలా ఉంటే.. టీపీసీసీ కొచ్చ ఛైర్మన్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా.. ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన భట్టి.. కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు అధిష్ఠానం నుంచి మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు. అందుకు ఉదాహరణే మహేశ్ కుమార్ గౌడ్‌కు టీపీసీసీ పదవి దక్కడమని అభివర్ణించారు. పీసీసీ పదవిని ఒక బీసీ వ్యక్తికి ఇవ్వటం చాలా గర్వకారణమని భట్టి చెప్పుకొచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మహేశ్ కుమార్ గౌడ్ మరింత బలోపేతం చేస్తారని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు.


మరోవైపు.. గతంలో పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కున్నారని భట్టి విక్రమార్క గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని.. జైళ్లలో వేశారని.. అయినా బెదరకుండా పార్టీ కోసం కష్టపడ్డారని తెలిపారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. అప్పుల పాలైన తెలంగాణలో.. ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa