తెలంగాణలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాలబారిన పడిన చాలా మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. రోగులతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిపోతున్నాయి. తాజాగా.. సెల్యూలైటిస్ వ్యాధి వణుకుపుట్టిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వ్యాధితీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దురదతో మొదలయ్యే ఈ వ్యాధి గాయంగా మారి ఇబ్బందులకు గురు చేస్తుంది.
నెలరోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరారు. సెల్యూలైటిస్ వ్యాధి సాధారణ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనే అయినా.. వ్యాధి తీవ్రతతో ప్రమాదకరంగా మారుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా కాళ్లపై ప్రభావం చూపుతుందని.. నిర్లక్ష్యం వహిస్తే శరీర భాగాలకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారు వెంటనే చికిత్స చేయించుకుంటే మేలని వైద్యులు చెబుతున్నారు.
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి సోకిన ప్రాంతంలో చర్మం దురద పెడుతుండటంతో పాటు ఈ దురదలు క్రమంగా పక్కకు కూడా వ్యాపిస్తూ ఉంటాయి.
నొప్పి, వేడిగా అనిపించడం
జ్వరంతో పాటు అది కొందరిలో చలిజ్వరానికి కూడా దారి తీస్తుంది.
వ్యాధిసోకిన చర్మపు ప్రాంతంలో వాపు, ముట్టుకోనివ్వకపోటం వంటివి ఉంటాయి.
సెల్యులైటిస్ వచ్చిన ప్రాంతాల్లో మచ్చలతో పాటు నీటి పొక్కుల్లా (బ్లిస్టర్స్) చర్మం మారిపోతుంది.
కొందరిలో చర్మంపై గుంతల్లా పడుతూ, చర్మం వదులైన తోలు మాదిరిగా కనిపిస్తుంది.
ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఇది చలికాలంలోనే ఎక్కువగా వస్తుంది. కాబట్టి చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
ఘాటైన రసాయనాలతో కూడిన సబ్బులు వాడకూడదు.
మోచేతులు, మోకాళ్లు వంటి చోట్ల మాయిశ్చరైజర్ వంటివి రాసి తేమగా ఉండేలా చూసుకోవాలి.
చర్మం పగుళ్లు బారి, తోలు రేగిన ప్రాంతాల్లో వాటిని గిల్లడం, లాగడం వంటివి చేయకూడదు.
గోళ్లు, చర్మంతో గోళ్లు ముడిపడే భాగాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
వ్యక్తిగత దుస్తులు, సామగ్రిని ఇతరులతో పంచుకోకూడదు.
ఎక్కడైనా చర్మం తెగినా, గాయపడ్డా డాక్టర్ సలహా మేరకు తగిన యాంటీబయాటిక్ క్రీమ్స్ వాడాలి.
డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa