ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తున్నాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 03:24 PM

పోషన్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా దుబ్బాక మండలం తిమ్మాపూర్ సెక్టార్ బల్వంతాపూర్ -1 వ అంగన్వాడి కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమం నిర్వాహించారు. కార్యక్రమాన్ని సీడీపీఓ ఎల్లయ్య జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గర్భిణలకు,బాలింతలకు,కిశోర బాలికలకు,పోషకాహర పదార్థాల ప్రదర్శన  నిర్వహించి,వాటి విలువలపై అవహగాహన కల్పించామన్నారు సరైన పోషణ ,ఆరోగ్య తెలంగాణ -పోషణ లోపం ఏ ఊరిలో కనిపించకూడదు అనే నినాదం తో  దుబ్బాక ప్రాజెక్ట్ పరిధిలోని అన్ని అంగన్వాడీ సెంటర్లలో ప్రతి లబ్దిదారులకు పోషక ఆహారం అందిస్తూ ,వాటి విలువలపైన అవగాహన కల్పిస్తున్నామన్నారు.
గర్భిణీ,బాలింతలు,పిల్లల ఎదుగుదల సంరక్షణ కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా పౌష్టిక ఆహారం అందిస్తూ,   గర్భిణీ మొదటి రోజు నుండి బిడ్డ పుట్టిన తర్వాత 2 సంవత్సరాల వరకు వరకు తీసుకోవలసిన పోషక పదార్థాలు, తల్లిపాల ప్రాముఖ్యతను వివరించామన్నారు .ఇట్టి కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైసర్ రాజేశ్వరి,పోషన్ అభియాన్ బ్లాక్ కో-ఆర్డినేటర్ శ్యాంసన్,ఏ ఎన్ ఎం వందన, ఆశవర్కర్ శోభ,గర్భిణీలు బాలింతలు, పిల్లలు, మరియు తిమ్మాపూర్ సెక్టార్ అందరూ అంగన్వాడీ టీచర్లు,తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa