ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జర్నలిస్ట్ కాలనీలో అన్ని సదుపాయాల కల్పనను కృషి చేస్తా: ఎమ్మెల్యే కెపి.వివేకానంద్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 19, 2024, 03:23 PM

పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి జర్నలిస్ట్ కాలనీకి చెందిన జర్నలిస్టులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాద పూర్వకంగా కలిసి కాలనీలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. 
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ఇప్పటికే జర్నలిస్టు కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, మంచినీటి సరఫరా వంటి వసతులను కల్పించామని, రాబోయే రోజుల్లో కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణము, పిల్లల పార్కు, చెర్ల ఎల్లమ్మ దేవాలయానికి రోడ్డు వంటి అభివృద్ధి పనులను చేపట్టి జర్నలిస్ట్ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆస్కాని మారుతి సాగర్, జర్నలిస్టులు లాలయ్య, దేవేందర్, కృష్ణారావు, మారుతి కుమార్, గోవిందరావు, గణేష్, రమేష్, శ్రీనివాసరావు, జగదీష్ గుప్త, మల్లికార్జున్, జీతయ్య తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa