పెండింగ్లో ఉన్న ఎస్సి కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణపతి అన్నారు.ఆదివారం నారాయణాఖేడ్ పట్టణంలోని దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ముఖ్య అతిధిగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణపతి హాజరై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం అమలతో పాటు మరియు రాష్ట్ర అసెంబ్లీలో జనాభా ఆధారంగా బడ్జెట్ ను కేటాయింపుచేయాలని,అన్నారు.
ప్రైవేటు రంగాల్లో దళితులకు రిజర్వేషన్ అమలు చేసి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా ఎస్సీ ఇండస్ట్రీ సబ్సిడీ నిధులను విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను విడుదల చేయాలని, కొత్త ఎస్సీ కార్పొరేషన్ రుణాలు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ప్రజలకు కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.దళితులపై దౌర్జన్యాలు, అంటరానితనాన్ని తక్షణమే నిలిపివేయాలని, భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కల్పించాలని, దళితులకు విద్యా హక్కు, భూమి హక్కు మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సాధారణ జనాభాగణతో పాటు సామాజిక,ఆర్థిక కులగణన నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ అభయ హస్తం ప్రారంభించి దళితుల అభ్యున్నతి కోసం పాటు పడాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనేకమంది దళితుల పైన దాడులు జరుగుతున్నాయని మతోన్మాద శక్తులను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి డీహెచ్పీఎస్ కార్యకర్తపై ఉందని రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి ని బలోపేతం చేయాలని సమావేశంలోని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ రాము సతీష్ ఆనందం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa