ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 06:37 PM

హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ భవన్ వద్ద నిరసన తెలిపారు.ఈ సమయంలో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది పరస్పరం దాడికి దారి తీసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరుపార్టీల వారిని చెదరగొట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa