నవంబర్ 1న స్థానిక సంస్థల్లో వెనుక బాటుతనం పై ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నామని, దీనిలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, మేధావులు హాజరై వారి అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం స్థానిక సంస్థలలో వెనుకబాటుతనం స్వభావం ప్రభావాన్ని సమకాలిన, సున్నమైన అనుభ పూర్వక విచారణను నిర్వహించేందుకు ప్రత్యేక బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం.
జరిగిందని, నవంబర్ 1 న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియ హల్ లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు కుల సంఘాలు, సంచార జాతుల ప్రతినిధులు హాజరై తమ అభిప్రాయాలు తెలియజేయాలని, ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలను, అభ్యర్థనలను రాతపూర్వకంగా వెరిఫికేషన్ ఆఫ్ డేవిడ్ తో పాటు 6 సెట్లలో తెలుగు లేదా ఆంగ్లం ఏదైనా భాషలో తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కి సమర్పించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa