ఎండపల్లి మండలంలోని గుల్లకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శనివారం మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధించిన గోడ పత్రికలను ఎంఈఓ గుండేటి రామచంద్రం ఆవిష్కరించారు. విద్యార్థులు విద్యను అభ్యసించే దశ నుంచే చదువు సంధ్యతో పాటు సమాజసేవకు మాదకద్రవ్యాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యహరించాలని ఎంఈఓ రామచంద్రం హితవు పలికారు. పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa