పార్శ్వగూని (స్కోలియోసిస్) బారిన పడినవారి బతుకు చాలా దుర్భరంగా ఉంటుంది. సాధారణంగా వెన్నెముకలో అమరికలు సక్రమంగా లేకపోవటం వల్ల చిన్నతనంలోనే కొందరికి పార్శ్వగూని ప్రారంభమవుతుంది. కొందరు మాత్రం పుట్టుకతోనే పార్శ్వగూని బారిన పడతారు. వారికి నరాలతో పాటు కండరాల్లో ఇబ్బందులు తెలుత్తుతాయి. వెన్నెముక సమస్య, రెండు కాళ్ల పొడవులో తేడాల కారణంగా, వంశపారంపర్యంగా కూడా కొందరు పార్శ్వగూని బారినపడే ఛాన్స్ ఉంటుంది. గూని కారణంగా ఆయా బాధితుల్లో వెన్నెముక నిటారుగా కాకుండా S లేదా C అక్షరాల మాదిరిగా వంగి ఉంటుంది.
కొందరు బాధితులకు గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలపైనా ఈ స్కోలియోసిస్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పరిస్థితి విషమిస్తే ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంటుంది. చిన్న పిల్లల్లో వెన్నెముక ఒకవైపు వంగినట్లు ఉన్నా, నడకలో ఏమాత్రం తేడాలు గమనించినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. ఎక్స్రే తీయటం ద్వారా ఈ సమస్యను డాక్టర్లు ప్రాథమికంగా గుర్తిస్తారు. అవసరమైతే ఇతర మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. గూనితో చాలా మంది ఆత్మన్యూనతకు లోనై ఇంటికి పరిమితమవుతారు. కొందరు వారి పనులు కూడా వారు చేసుకోలేదు.
అయితే ఇలా పార్శ్వగూని బారిన పడినవారికి తీపి కబురు. ఇటువంటి బాధితులకు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు అక్కడి వైద్యులు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ప్రతి ఏడాది 100 వరకు స్కోలియోసిస్ సర్జరీలు జరుగుతుండగా.. ఒక్క నిమ్స్ ఆర్థోపెడిక్ విభాగంలోనే 90 సర్జరీలు చేస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఒక్కో సర్జరీకి రూ.8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. నిమ్స్లో మాత్రం కేవలం రూ.లక్షకే సర్జరీ చేస్తున్నారు.
ఆరోగ్యశ్రీ ఉంటే ఆయా రోగులకు ఫ్రీగా ఈ సర్జరీ చేస్తున్నట్లు నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. చాలా క్లిష్టమైన పార్శ్వగూని సర్జరీలను నెలకు 8 నుంచి 10 వరకు చేస్తున్నట్లు నిమ్స్ ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ నగేశ్ చెరుకూరి వెల్లడించారు. హాస్పిటల్లో ఎటువంటి నిరీక్షణ లేకుండానే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. నిమ్స్లో సర్జరీలు చేసుకున్న చాలామంది ప్రస్తుతం సాధారణ జీవితం గడుపుతున్నట్లు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa