వరంగల్లో ఆసక్తికరమైన ఘటన జరిగింది.. పోలీసులు జాగిలాన్ని తీసుకొచ్చి తనిఖీలు చేస్తుంటే.. ఊహించని పరిణామం ఎదురైంది. పోలీసులు ఏదో అనుకుంటే.. అక్కడ ఇంకేదో అయ్యింది. వరంగల్లో పోలీసులు కొత్తగా తీసుకొచ్చిన శునకం (స్నిఫర్ డాగ్)తో రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి, డ్రగ్స్ను పట్టుకునేందుకు వచ్చారు.. ఇంతలో ఆ పోలీస్ జాగిలం రైల్వే స్టేషన్ బయటకు పరుగులు తీసింది. నేరుగా ఓ ఇంటివైపు వెళ్లి మెట్లెక్కింది.. అక్కడ ఏం జరుగుతుందో పోలీసులకు అర్ధంకాలేదు.. జాగిలం కొత్తగా రావడంతో గందరగోళానికి గురయ్యిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. పోలీసులు మెల్లిగా ఆ జాగిలం వెంట అనుసరించారు.. ఆ ఇంటి మెట్లెక్కి పైకి వెళ్లింది.
ఆ ఇంటిపైన పూల కుండీల దగ్గరకు వెళ్లి మొక్కల్ని వాసన చూసింది. అక్కడ సీన్ చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఆ ఇంటి యజమాని గుట్టుగా పూలకుండీల్లో పెంచుతున్న గంజాయి మొక్కల్ని చూసి పోలీసులు అవాక్కయ్యారు. పోలీసులు వెంటనే ఆ ఇంటి యజమాని కుమార్ను అదుపులోకి తీసుకొని, మొక్కల్ని స్వాధీనం చేసుకున్నారు. అతడ్ని ప్రశ్నిస్తే అన్ని విషయాలు చెప్పాడు.. సులభంగా డబ్బు సంపాదనతో పాటు తన అవసరాల కోసం ఇంటిపై ఇలా పూల కుండీల్లో గంజాయి మొక్కల పెంచుతున్నట్లు తేలింది. పోలీస్ స్టేషన్లో తనిఖీల కోసం వస్తే.. ఈ గంజాయి వ్యవహారం బయటపడటంతో పోలీసులు ఆశ్చర్యపోయారు.
కుమార్ను మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం కింద అరెస్ట్ చేసిన డ్రగ్స్ కంట్రోల్ టీం పోలీసులు మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నగరంలో ఎవరైనా వ్యక్తులు మత్తు పదార్థాలను విక్రయిస్తున్నా, వాడుతున్నా, తరలిస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. 8712584473 నంబర్కుకు సమాచారం ఇవ్వాలని.. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. వరంగల్ పోలీసు కమిషనరేట్కు మత్తు పదార్థాల వాసన చూసి గుర్తించే జాగిలాన్ని ఇటీవల తీసుకొచ్చారు. ఈ శునకం సుమారు 100 మీటర్ల దూరంలో డ్రగ్స్ ఉన్నా గుర్తిస్తుంది.. వరంగల్ రైల్వేస్టేషన్లో శివనగర్ వైపు ఉన్న ప్లాట్ఫారాలపై తనిఖీలు చేస్తున్న క్రమంలోనే ఈ గంజాయి గుట్టును బయటపెట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa