ఆరేళ్ల క్రితం పెళ్లైంది. ఆ దంపతుల అన్యోన్య జీవితానికి ఇద్దరు పిల్లల సంతానం. అయితే కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు చెలరేగాయి. నిత్యం దంపతులు ఒకరిపై ఒకరు తిట్టుకుంటున్నారు.ఇది నిత్యకృత్యం అయిపోయింది. ఈ వివాదాలు కాస్త మనస్పర్థలకు దారి తీసింది. నిత్యం గొడవలతో భర్త తట్టుకోలేకపోయారు. భార్యపై కోపంతో రగిలిపోయారు. అంతే రోజువారీగానే దంపతుల మధ్య గొడవ జరిగింది. అంతే భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. అనంతరం నిప్పంటించేశాడు. ఈ షాకింగ్ ఘట హైదరాబాద్లో జరిగింది. సంసారంలో చిన్నపాటి గొడవలను తట్టుకోలేకపోయిన చిన్న పాటి గొడవలకు సహనం కోల్పోయిన భర్త.. భార్యపై కత్తితో దాడి చేసి తగలబెట్టేశాడు.ప్రాణం తీసిన కలతలుహైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో ఫైజ్ ఖురేషి, ఖమర్ బేగం దంపతులు నివశిస్తున్నారు. వీరిద్దరికి పెళ్లై 6 సంవత్సరాలైంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. భర్త ఫైజ్ ఖురేషి నగరంలో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లపాటు వీరి సంసారం సాఫీగా సాగింది. అయితే కొద్దిరోజులు వీరి సంసార జీవితంలో కలతలు చెలరేగాయి. రోజూ ఏదో గొడవ జరుగుతుండటంతో భర్త ఖురేషి భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. పగతో రగిలిపోయాడు. ఈసారి గొడవ పెట్టుకుంటే హత్య చేయాలని భావించాడు. ఇందుకు సంబంధించి ముందస్తు ప్రణాళిక వేసుకున్నాడు. ఈ క్రమంలో కత్తిని కూడా కొనుగోలు చేశాడు.ప్లాన్ ప్రకారం హత్యఆటో నడుపుకుని సోమవారం అర్థరాత్రి ఖురేషీ ఇంటికి చేరుకున్నాడు. అనంతరం కాసేపటికే దంపతుల మధ్య గొడవ మెుదలైంది. అప్పటికే భార్యపై పగతో రగిలిపోతున్న ఖురేషీ ప్లాన్ ప్రకారం ఆమెను అంతమెుందించాలని భావించాడు. దీంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో భార్యపై దాడి చేసి హత్య చేశాడు. ఆమె మృతి చెందిన నిర్దారించుకున్న తర్వాత మృతదేహాన్ని తగలబెట్టాడు. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్న చేశాడు. దీంతో చుట్టుపక్కల వారు ఆ ఇంటికి రావడంతో భయాందోళన చెందిన ఖురేషీ అక్కడ నుంచి పరారయ్యాడు.ఇద్దరు పిల్లల ఆచూకీ ఎక్కడ?ఇకపోతే ఖురేషీ ఇంటిలోని ఘటనపై పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి బయలుదేరే లోపు ఖురేషీ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. దీంతో ఖురేషిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఖమర్ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య జరిగిన ప్రాంతంలో ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో ఆ పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖమర్ బేగం మృతిపై కుటుంబ సభ్యులపై బోరున విలపిస్తున్నారు. అటు తల్లిని కోల్పోయి ఇటు తండ్రి జైలుపాలవ్వడంతో చిన్నారులు అనాథలుగా మిగిలారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa