ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉరేసుకుని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2024, 12:52 PM

HYD బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో గల శ్రీ చైతన్య బాయ్స్ ఎలైట్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి ప్రాంతానికి చెందిన జశ్వంత్ గౌడ్ తన హాస్టల్ గదిలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.కళాశాల యాజమాన్యం విద్యార్థి ఆత్మహత్య విషయాన్ని మృతుని తల్లిదండ్రులకు చేరవేసింది. విద్యార్థి ఎందుకు ప్రాణాలు తీసుకోవాల్సి వచ్చింది..? అనే వివరాలు తెలియడం లేదు. ఈ ఘటనపై తోటి విద్యార్థులు సైతం నోరు మెదపడం లేదు. చదువు ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్నాడా..? లేదా మరేదైనా కారణం ఉందా..! అనే వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa