బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని దక్కించుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ సూచనతోనే మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని ఎద్దేవా చేశారు. ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? కలెక్టర్ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.కలెక్టర్పై దాడి ఘటనను సమర్థించడమేమిటని ప్రశ్నించారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.మూసీ పరీవాహక ప్రాంతంలో ఈరోజు బీజేపీ చేస్తున్న 'మూసీ నిద్ర'పైనా పొన్నం ప్రభాకర్ స్పందించారు. బీజేపీ నేతలు మూసీ వద్ద రేపు నిద్రలేచిన తర్వాత అక్కడి వాస్తవాలను ప్రజలకు చెప్పాలని సూచించారు. ఇప్పటికైనా బీజేపీ నేతలు మొద్దు నిద్ర నుంచి లేవాలన్నారు.నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాల్వ వాసన చూసిన తర్వాత అయినా వారు దైవసాక్షిగా నిజాలు చెబుతారని భావిస్తున్నానన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa