ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారు : పీసీసీ చీఫ్ c

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 17, 2024, 04:21 PM

మూసీ ప్రాజెక్టు ఆపేందుకు బీజేపీ, BRS కుమ్మక్కై ఆపేందుకు కుట్ర చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటో షూట్ కోసం మూసీ నిద్ర చేశారు అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.బస చేసే ముందు ఆ ప్రాంతంలో దోమల మందు, ఈగల మందు కొట్టారు. ఒక్కరోజు కాదు.. మూడు నెలలు అక్కడ ఉంటే ప్రజల అవస్థలు తెలుస్తాయి. మూసీ పక్కన మూడు నెలల బస చేయండి అని మా సీఎం సవాల్ చేస్తున్నారు. నేను కూడా వస్తాను. మీరు నేను ఇద్దరం కలసి మూడు నెలలు అక్కడ బస చేద్దాం రండి. అక్కడి ప్రజలు అనారోగ్యాల పలు అవుతున్నారు.BRS గ్రాఫ్ పడిన ప్రతీ సారి కిషన్ రెడ్డి బయటకి వస్తాడు. BRS ను ప్రొటెక్ట్ చేయడానికి కిషన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కరోజు నిద్ర చేసి ఏం సాధించారు. తెలంగాణ అభివృద్ధి కి అందుకు అడ్డుపడుతున్నారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కి ఒక న్యాయం.. మూసీ రివర్ కి ఒక న్యాయమా..? మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇచ్చి ఆదుకుంటాం. వారి పిల్లలకు విద్య అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుంది అనగానే.. వీళ్లకు భయం పట్టుకుంది. కానీ మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. కిషన్ రెడ్డి కాళ్ళకు సాక్సులు వేసుకొని నిద్రపోయారు. అంటే అక్కడ ఎన్ని దోమలు ఉన్నాయో అర్థం అవుతుంది అని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa