రజక సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ముడిమ్యాల, పామేన గ్రామాల నూతన అధ్యక్షులు వెంకటేష్, యాదగిరి అన్నారు. ఆదివారం చేవెళ్ల మండల పరిధిలోని ముడిమ్యాల, పామేన గ్రామాలలో రజక సంఘం మండల అధ్యక్షులు శివకుమార్, ఉపాధ్యక్షులు మల్లేష్ కుమార్, ప్రభాకర్, గౌరవ అధ్యక్షులు మల్లేష్ ల అధ్యక్షతన రజకులు సమావేశమై నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముడిమ్యాల గ్రామ నూతన అధ్యక్షుడిగా వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా శీను, ప్రధాన కార్యదర్శిగా గోపి, గౌరవాధ్యక్షులుగా మహేష్, కరుణాకర్, కోశాధికారులుగా నర్సిములు, రమేష్, సహ కోశాధికారులుగా రవి, సురేష్, సభ్యులుగా సామయ్య, జంగయ్య, పోచయ్య, బిక్షపతి, రాము, చెంద్రయ్య, వెంకటయ్య, శ్రీనివాస్, అదేవిధంగా పామేన గ్రామ రజక సంఘం నూతన అధ్యక్షుడిగా యాదగిరి, ఉపాధ్యక్షుడిగా నరసింహ, ప్రధాన కార్యదర్శిగా శివరాజ్, గౌరవ అధ్యక్షులుగా లక్ష్మయ్య, మల్లయ్య, కోశాధికారులుగా ప్రశాంత్, భీమయ్య సహా కోశాధికారులుగా ప్రవీణ్ శంకరయ్య, సభ్యులుగా తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa