ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 23న అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ.. తుఫానుగా మారే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈనెల 26 లేదా 27 నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా పయనిస్తుందని అంచనా. దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురుస్తాయన్నారు. దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది.
ఇక తెలంగాణలో నేటి వాతావరణంపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రస్తుతానికి వానలు పడే అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. బంగాళాఖాతం ప్రశాంతంగా ఉందని.. మేఘాలు కూడా లేవని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నేడు ఎక్కడా వర్షాలు పడే ఛాన్స్ లేదన్నారు. కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. గాలి వేగం తెలంగాణలో మాగ్జిమం గంటకు 10 కిలోమీటర్లుగా ఉంటుందన్నారు. బంగాళాఖాతం నుంచి గాలి వేగం పెరుగుతోందని..అరేబియా సముద్రంలో ఒక ఆవర్తనం ఏర్పడుతోంది అది గాలులను తనవైపు లాక్కుంటోందని చెప్పారు.
ఇక ఉష్ణోగ్రత చూస్తే..నేడు తెలంగాణలో మాగ్జిమం 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని చెప్పారు. చల్లని గాలుల వల్ల ఎండ వేడిగా ఉన్నట్లు అనిపించదన్నారు. తేమ బాగా తగ్గిందని... తెలంగాణలో 40 శాతం కంటే తక్కువ ఉంటుందని చెప్పారు. అదే సమయంలో చలి తీవ్రత పెరుగుతుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 18 డిగ్రీల సెల్సియస్కు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వెచ్చటి ఉన్ని దుస్తులు ధరలించాలని.. వేడి వేడి ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోవాలని చెబుతున్నారు. అలాగే ఉదయం పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa