ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాగజ్‌నగర్ మండలంలో తీన్మార్ మల్లన్న నూతన మండల కమిటీ ఎంపిక...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 03:43 PM

కాగజ్‌నగర్ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ మండల కేంద్రంలో నూతన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్  మాట్లాడుతూ కడారి శ్రీనివాస్ ను గత కొన్ని నెలల కింద అధ్యక్షుడిగా ఎంపిక చేయగా తాను మండల మండలానికి అవసరమైన కమిటీ సభ్యులను ఎన్నుకొని నేడు కమిటీని ప్రకటించుటకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా కడారి శ్రీనివాస్ మాట్లాడుతూ, సంఘ సేవకు నడుంబిగించాలని సంకల్పం చేసుకున్నట్లు తెలిపారు. మల్లన్న నామస్మరణతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సంఘం ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు.
కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం నాయకులు జిల్లా అధ్యక్షుడిగా ఉప్పరి నాగేష్ కాగజ్నగర్ మండల అధ్యక్షుడిగా కడారి శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా మేకల క్రాంతి కుమార్, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులుగా మల్లెపల్లి రాజ నరసయ్య  కమిటీ సభ్యులు  మాదాస్ నగేష్ , ఇప్ప వెంకటేష్, కందుల కార్తీక్, తొగరి రాజేష్ , సోగల శ్రీనివాస్, దుర్గం రాజు, నస్పూరి శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa