ప్రస్తుత సమాజంలో పిల్లల్లో విపరీత ధోరణి పెరిగిపోతుంది. మారుతున్న కాలం, టెక్నాలజీ ప్రభావంతో చాలా మంది పిల్లలు చెడు వ్యసానాల బారిన పడుతున్నారు. చిన్న వయస్సుల్లోనే చెడు వ్యవసానాలకు బానిసలుగా మారి ఎంతో విలువైన ప్రాణాలు పోగోట్టుంటుకున్నారు. పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా.. రాజన్న సిరిసిల్ల జిల్లాలలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించినందుకు ఓ పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళితే.. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి(16) చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఓ రోజు సిగరెట్ తాగుతూ తండ్రి కంట పట్టాడు. దీంతో తండ్రి ఆగ్రహం వ్యక్తం చేయటంతో పాటు తీవ్ర స్థాయిలో మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన సదరు విద్యార్థి పొలానికి వెళ్లి గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న కుమారుడిని చూసిన తండ్రి వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స తర్వాత విద్యార్థి కోలుకున్నాడు. ఆరు నెలల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది.
అప్పటి నుంచి ఆ విద్యార్థి మనో వేధనకు గురయ్యాడు. గతంలో జరగిన విషయాన్ని మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు. ఇక ఈ భూమ్మీద తాను జీవించి లాభం లేదని.. చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం (నవంబర్ 22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఊరేసుకొని చనిపోయాడు. దీంతో విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తండ్రి బోరున విలిపించటం అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, ఎదుగుతున్న పిల్లలపై తల్లిదండ్రులు ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. వారి ప్రవర్తన తీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని అంటున్నారు. చుట్టూ ఉన్న పరిసరాలు వారిని చెడుదోవ పట్టించే ప్రమాదం ఉంటుందని.. అలా కాకుండా వారు మంచి దారిలో నడిచేందుకు తల్లిదండ్రులే చొరవ తీసుకోవాలని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa