తెలంగాణలో మరో విషాదం చోటు చేసుకుంది. 7వ తరగతి గురుకుల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్నాడు 7వ తరగతి విద్యార్థి. వనపర్తి జిల్లా మదనాపురం బాలుర గురుకులంలో దుప్పటితో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కొన్నురు గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థి ప్రవీణ్.అయితే.. 7వ తరగతి విద్యార్థి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియదు.. కానీ.. ఎవరూ లేని సమయంలో.. ఈ సంఘటన జరిగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటనపై అధికారులు కూడా ఏం చెప్పడం లేదు. ఉపాధ్యాయులు వేధిస్తే.. ఇలా చేసుకున్నాడా.. లేక ఇతర కారణాల తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa