రాలు.. ఘోరాలు మన చుట్టూనే.. మనకు తెలియకుండానే చాలా జరిగిపోతున్నాయి. ఇలా చేయటం చట్ట విరుద్ధం అని తెలిసినా.. యదేచ్ఛగా చేసేస్తున్నారు.. హైదరాబాద్ సిటీ నడిబొడ్డున..హైటెక్ సిటీకి కూతవేటు దూరంలోని మైహోం భూజ అనే గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ టవర్స్ లో జరిగిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్( 25) అనే యువతి సరోగసి ద్వారా పిల్లలను కనివ్వడం కోసం రాజేష్ బాబు (55) అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు గానూ రాజేష్ బాబు ఆమెతో రూ.10 లక్షల డీల్ కదుర్చుకున్నాడు. దీంతో ఆమెను ఒరిస్సా నుంచి తీసుకొచ్చి రాయదుర్గంలోని మై హోం భుజాలోని తన ప్లాట్ లో ఉంచాడు. అయితే గత కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవడం..బయటకు వెళ్లనివ్వకపోవడంతో అశ్విత్ సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తు పై నుంచి కిందపడి చనిపోయింది అశ్విత్ సింగ్.అశ్విత సింగ్ కు భర్త నాలుగేళ్ల బాబు ఉన్నాడు. ఘటనా స్థలానికి వచ్చిన రాయదుర్గం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. రాజేష్ బాబు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa