పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని రాఘవాపూర్ లో గల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్, ప్రసంగించిన మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ఉద్యమ కాలం నుంచి అనేక పోరాటాలతో వారి క్రియాశీల పాత్ర ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించబడిందని, వారు తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని, వివిధ రాజకీయ పార్టీలను సైతం మెప్పించి ఒప్పించడమే కాకుండా ఢిల్లీ పెద్దలకు సైతం తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించి, బిల్లు ఆమోదింపజేసే క్రమంలో ప్రాణాలను ఫనంగా పెట్టి ఆమరణ.
నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రానికి వారు చేసిన కృషిని, త్యాగాన్ని వివరించడం జరిగింది. వారి త్యాగానికి, సేవకు గుర్తుగా డిసెంబర్ 29న జరిగే "దీక్ష దివస్" కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించాలని పెద్ద ఎత్తున ప్రతి గ్రామ స్థాయి నుండి , మండల స్థాయి, నియోజకవర్గ, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు, ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు అందరూ చాలా గొప్పగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా ఇంచార్జ్ కొప్పుల ఈశ్వర్ సారథ్యంలో పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ జెడ్పిటిసిలు, మండల అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa