ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతు పండుగ ఉత్సవాలకు బయలుదేరిన ఎమ్మెల్యే, రైతులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 12:31 PM

ప్రజా పాలన ఉత్సవాలలో భాగంగా శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్రవ్యాప్త రైతు పండగ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభను వియజవంతం చేయాలని కోరుతూ ప్రజలు, రైతులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో ప్రజా పాలన ఉత్సవాలకు బయలుదేరారు. అమిస్తాపూర్ వద్ద శనివారం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్తంగా రైతు పండగ ఉత్సవాలకు నారాయణఖేడ్ నుండి ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో 3 బస్సులలో రైతులు తరలివెళ్లారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa