30 సంవత్సరాల మా న్యాయమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల విద్యార్థి నాయకులందరూ కలిసి ఎస్సీ వర్గీకరణ అమలుకై జనవరి 5న మాదిగ విద్యార్థి గర్జన సభ ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ క్లబ్ లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల విద్యార్థి నాయకులు పాల్గొని మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సూచించిన సమానత్వ సూత్రం ఆధారంగానే జనాభా దమాషా ప్రకారం విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో సమాన వాట దక్కాలని కోరుతున్నామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్లనే 30 ఏళ్ల నుండి మాదిగ-మాదిగ ఉపకుల విద్యార్థులు విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో తీవ్రంగా నష్టపోయారని అన్నారు.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి వర్గీకరణ వ్యతిరేకిస్తున్నటువంటి వారందరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉందని ఇప్పటికైనా వర్గీకరణకు సహకరించి అన్నదమ్ముల లాగా కలిసి ఉందామని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో కాలయాపన చేయడం తగదని అన్నారు, ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు భర్తీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగంలో మాదిగ మాదిగ, ఉపకులాల విద్యార్థులందరికీ న్యాయం జరగాలని ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం పై ఒత్తిడి చేయడానికి జనవరి 05 న మాదిగ విద్యార్థి గర్జన సభను నిర్వహించనున్నట్లు సభను విజయవంతం చేయడానికి రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాల,నియోజకవర్గాలు,మండలాల నుండి పెద్ద ఎత్తున సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa