ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్ అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 02:50 PM

వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశంలో ఎస్సీ విద్యార్థులకు అందించే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖల అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ ,యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష  నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ పోస్టు మేట్రిక్ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకునే క్రమంలో వస్తున్న సమస్యలను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.  పదవ తరగతి సర్టిఫికెట్ లో ఉన్న వివరాలకు ఆధార్ కార్డులో ఉండే విధంగా తప్పులను సరి చేసుకునేందుకు  వీలుగా ఆధార్ కిట్లను సమకూర్చుకోవాలన్నారు.
విద్యార్థుల గ్యాప్ సర్టిఫికెట్ నిమిత్తం కళాశాల ప్రిన్సిపాల్స్,  యాజమాన్యాలు డీఎస్సీడివో కు విద్యార్థుల జాబితాలను సమర్పించాలని తెలిపారు. నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇ-పాస్ పోర్టల్ స్కాలర్ షిప్ నిమిత్తం రిజిస్టర్ చేసుకున్నట్లయితే స్కాలర్ షిప్ త్వరలో  మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.సమీక్ష సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, షెడ్యూల్డు కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa