తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది అదిరిపోయే న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు పెరగనున్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలపై కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. ధరలు పెంచాలని ఉత్పత్తిదారులు, పెంపుపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలు చేసినా.. రేవంత్ ప్రభుత్వం అంగీకరించలేదని తెలుస్తోంది.
ప్రతి రెండేళ్లకోసారి ధరల పెంపుపై త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంటుంది. ఇటీవల కూడా బీర్ల ధరలు రూ.20 చొప్పున, ఇతర మద్యం ధరలు రూ.30-40 చొప్పున పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అయితే మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు సమాచారం. రాష్ట్రంలో బీర్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాసిన ఉత్తరానికి సీఎం రేవంత్ ఘాటుగా జవాబు ఇచ్చినట్లు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఒత్తిళ్లకు లొంగదని ఆయన వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రంలో మధ్యం ధరలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ స్పష్టం చేసినట్లు సమాచారం.
కాగా, తెలంగాణలో మద్యం ధరలు పెంచేందుకు ప్రభుత్వమే సిద్ధంగా ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలో ధరలు ఎక్కువగా ఉన్నాయని.. వాటి ఆధారంగా ధరలు సవరించేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు ప్రచారం జరిగింది. బీరుపై రూ. 15-రూ. 20, క్వార్టర్ బ్రాండ్ను బట్టి రూ. 10-రూ. 80 వరకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ పెంపు ద్వారా ప్రతి నెలా రూ.500-రూ.700 కోట్ల అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే బీర్ల ధరల పెంపుపై ప్రభుత్వం సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగున్నట్లు సమాచారం. ఈ మేరకు మద్యం ధరల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అంగీకారం తెలపలేదని తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa