ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అదంతా ఫేక్.. నేనూ ఎర్రచందనం వ్యాపారినే: పుష్ప-2పై బీజేపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 04, 2024, 07:49 PM

యూత్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో సందడి చేయనుంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అత్యధికం స్క్రీన్లలో విడుదలవుతోన్న భారతీయ సినిమాగానూ అరుదైన ఘనత సాధించింది. కాగా, పుష్ప-2 సినిమాపై బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాలో ఎర్ర చందనం ధర గురించి చూపించిందంతా అబద్దమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి వ్యాఖ్యానించారు.


‘‘ఎర్రచందనం టన్ను లక్షల రూపాయలు ఉంటే పుష్ప మొదటి భాగంలో కోటి రూపాయలు లాగా చూపించారు... దీంతో పెద్ద సంఖ్యలో చెట్లను యువత నరికేశారు.. ఇప్పుడు 'పుష్ప 2'కి ఇంకెన్ని చెట్లు నరికేస్తారో? సినిమా వల్ల యువత చెడిపోతోంది... అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి.. సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలి’ అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తాను ఎర్రచందనం లైసెన్స్ వ్యాపారిని అని ఆయన వెల్లడించారు.


ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, పుష్ప-2 సినిమాపై జనసేన నేత కూడా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పకపోతే 'పుష్ప-2' సినిమాను ఆంధ్రప్రదేశ్ లో అడ్డుకుంటామని గన్నవరం నియోజకవర్గం జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు హెచ్చరించారు


ఇదే సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీద ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ‘మధ్యాహ్నం తాగి మతిస్థిమితం లేకుండా మాట్లాడే పిస్స ఎంకడు’ అని ఆయనపై ఘాటైన పదజాలం వాడారు. ‘మధ్యాహ్నం మందు తాగే కోమటిరెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చారు’ అని ధ్వజమెత్తారు. ‘‘నన్ను కాదని ఓడిపోయిన మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్యే అని పరిచయం చేయడానికి నువ్వెవరు? నీకు డబ్బు ఎక్కువ ఉంటే మడిచి దగ్గర పెట్టుకో ? కోమటిరెడ్డి అనే పేరు వల్ల బతికిపోయావ్ ?’ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.


‘‘నువ్వు నల్లగొండలో రాజీనామా చెయ్యి నేను నిజామాబాద్ జిల్లాలో రాజీనామా చేస్తా.. ఇద్దరు పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం?’’ అని సవాల్ విసిరారు. ‘‘నీకు బాగా బలుపు ఉంది మడిచి పెట్టుకో ?... దక్షిణ తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణకు పిచ్చి వాగుడు వాగుతున్నారు.. ’’ రాకేశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇటీవల నిజామాబాద్ పర్యటన సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాకేశ్ రెడ్డి పై విధంగా స్పందించారు. నాలుగు సార్లు గెలిచిన అని గొప్పలు చెప్పుకునే వ్యక్తికి ఎలా మాట్లాడాలో తెలియదా? అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa