ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 03:12 PM

ఎస్సీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని దళిత రత్న అవార్డు గ్రహిత ఎంర్ పిఎస్ రాష్ట్ర కార్యదర్శి  సిద్దిని రాజమల్లయ్య డిమాండ్ చేసారు.. బుధవారం సంగా రెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ వర్గీకరణ వన్ మెన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ శామీమ్ అక్తర్ కి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ గత 30 ఏళ్లు కొట్లాడి సుప్రీంకోర్టు ద్వారా సాధించుకున్న హక్కులను రోజున సీఎం రేవంతరెడ్డి న్యాయమైన తీర్పు అని దేశంలో నేనే ముందుగా రాష్ట్రంలో అమలు చేస్తానని నమ్మించారన్నారు. ప్రస్తుతం అన్ని ఉద్యోగాల నియామకాల్లో ఎలాంటి ఆర్డినెన్స లేకుండా నియామకాలు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరిస్తూ వర్గీకరణ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి బొంబాయి వెంకన్న, లింగాల కృష్ణ, జంగపల్లి సాయిలు, బోడ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa