ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర స్థాయి భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీల్లో గాయత్రి విద్యార్థులు ఎంపిక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2024, 03:17 PM

గీతా జయంతి సందర్భంగా గీతా ప్రచార సమితి, ఆధ్వర్యంలో  గోదావరిఖని లో నిర్వహించిన జిల్లా స్థాయి భగవద్గీత శ్లోక కంఠస్త పోటీల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ కి చెందిన విద్యార్థులు పాల్గొని తమ అద్భుతమైన గాత్రంతో శ్లోకాలను వీనులవిందు ఆలపించి ఉన్నత వర్గం విభాగం లో 9 వ తరగతి కి చెందిన పూరెళ్ళ హన్విత ప్రథమ బహుమతి, చంద్రకారి లయవర్ధిని కన్సోలేషన్ బహుమతి, మాధ్యమిక విభాగంలో 7 వ తరగతి విద్యార్థి కొమురవెల్లి కార్తీక్ ప్రథమ బహుమతి, శిశు వర్గం విభాగంలో 2 వ తరగతి విద్యార్థిని పెద్దపల్లి క్వీనా హరిణి తృతీయ బహుమతి సాధించి.
ఈ నెల 8 వ తేదీన హైదరాబాద్ లోని రామంతాపూర్ లోని అరోరా కాలేజ్ లో జరిగే రాష్ట్ర స్థాయి శ్లోక కంఠస్థ పోటీలకు ఎంపికైనట్లు గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులను మరియు విద్యార్ధుల వెంట ఉండి వారు శ్లోకాలను తక్కువ సమయంలోనే అద్భుతంగా నేర్చుకొని శృతి తో పాడేలా కృషి చేసిన ఉపాధ్యాయురాళ్ళు కొమ్ము సృజన, శాంత లక్ష్మి, రాజమణి లను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ విజయ్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa