పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల అంశంపై మంగళవారం జిల్లా స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థ లు తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 585గ్రామ పంచాయతీలలోని 4982 వార్డులకు గాను, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 4982 పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. వీటిలో 200 లోపల ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 4129 ఉన్నాయని, 201-400 మధ్య ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 796 ఉన్నాయని, 401నుండి 650 పైన ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 57ఉన్నాయని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపమని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. తదుపరి డిసెంబర్ 12వ తేదీన ఎంపీ డి ఓల ఆధ్వర్యంలో మండల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో , జిల్లా పంచాయతీ అధికారి జయసుధ , రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa