ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్కూల్‌ బస్సు ఢీకొని యువకుడు మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 03:36 PM

రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. చేవెళ్ల మండల పరిధిలోని మొండివాగు గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్(22) తండ్రి మహమ్మద్ నహీమ్ మంగళవారం ఉదయం సుమారు ఏడు గంటల సమయంలో తన పల్సర్ బైక్ (TG 07 K 0906) పైన ఎన్కెపల్లి గేట్ వద్దకు వెళ్తుండగా మార్గమధ్యంలో మోడీ వెంచర్ కు సమీపంలో తనకు ఎదురుగా వస్తున్న ప్రైవేట్ స్కూల్ (శ్రీ సత్యసాయి గ్రామర్ హైస్కూల్) బస్సు(AP 28 TC 5097) ను డ్రైవర్ నిర్లక్ష్యంతో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి ఇమ్రాన్ పల్సర్ ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఇమ్రాన్ పల్సర్ బైక్ మీద నుంచి కింద పడిపోవడంతో తన తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి నహీమ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్ రెడ్డి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa