నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం శంకరం తండా నుండి నర్సంపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కంభంపాటి పుల్లారావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చెన్నరావు పేట్ మండల శంకరం తండా చెందిన కాంగ్రెస్ పార్టీ BRS పార్టీల కార్యకర్తలు బిజెపి పార్టీలో చేరడం జరిగింది ఈ చేరికలు చెన్నారావుపేట మండలం మాజీ కన్వీనర్ దామర్ల శేఖర్ ఓ బి సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీరామ్ ఆధ్వర్యంలో పార్టీలో ఆహ్వానించడం జరిగింది బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అజ్మీర తారక్ నాయక్ ,భూక్య రాజేందర్, అజ్మీర వెంకటేష్ ,జాటోత్ ప్రశాంత్, భూక్య గణేష్, వాంకుడోత్ రాజేందర్ ,చేరికలు చేయడం జరిగింది మోడీ చేసిన ఆర్థిక సంస్కరణ వల్ల నేడు భారతదేశంలో ఐదవ ఆర్థిక దేశంగా ముందంజలో నిలబడడం జరిగింది. దేశ ఆర్థిక రక్షణ ఉపాధి ఆరోగ్య మొదలుకు రంగాల్లో భారతదేశం ముందంజలో నిలవడం జరిగింది.
మోడీ రాజకీయ దౌత్యం ప్రపంచ దేశాలే పెద్దన్నగా గుర్తించడం జరిగిందని ఏ భారత దేశపు ప్రధానికి రానీ ప్రపంచ దేశ అత్యుత్తమ పురస్కారాలు మోడీ కి దక్కాయని ఇదే ఆయన సుస్తరిత పాలనకు నిదర్శనమని పుల్లారావు తెలియజేయడం జరిగింది తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ముందంజలో ఉంటుందని దానికి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త నడుమిగించి మోడీ సంక్షేమ కార్యక్రమాలను పథకాలను ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు నర్సంపేట నియోజకవర్గం లో రాబోయే రోజులలో ఎగురుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa