విద్యార్థి ఉద్యమాల పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ అన్నారు సోమవారం రోజున ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పట్టణలోనిపలు కేంద్రాలలో ఎస్ఎఫ్ఐ 55వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం అనే నినాదంతో ఉన్న జెండాను ఆవిష్కరించి 1970లో డిసెంబర్ నెలలో ఎస్ఎఫ్ఐ కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో ఏర్పడిందన్నారు విద్యార్థుల సమస్యలే లక్ష్యంగా ఎన్నో విజయాలు సాధిస్తూ పోరాటాలను కొనసాగిస్తూ ఈ భారత దేశంలో అతిపెద్ద విద్యార్థి సంఘం గా అవతరించిందన్నారు నాటి నుండి నేటివరకు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ.
ఈ భారత దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ముందుకు వెళుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించడంలో విఫలమైందన్నారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర దగ్గరికి వస్తున్న కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్యశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు జల్లెల ఇద్ది రాములు, మోర రోహన్, కొర్ర దినేష్, రామావత్ శరత్, అపర్ణ, సౌజన్య,నందిని,శ్రావణి లావణ్య,మమత, అంజలి,సంధ్య,పూజ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa