ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్‌లో చేరిన నిర్మల్ నియోజకవర్గ సీనియర్ నేత మహేశ్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 02, 2025, 06:08 PM

తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత పీవీ మహేశ్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి... బీఆర్ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువాను కప్పుకున్నారు.కేటీఆర్ ఆయనకు పార్టీ కండువాను కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మహేశ్ రెడ్డి మాట్లాడుతూ... నిర్మ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌న్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa