ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంక్రాంతి రద్దీ వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు...

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 17, 2025, 06:49 PM

సంక్రాంతి రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అదనంగా మరో 8 ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాల మధ్య నడపనున్నట్లు శుక్రవారంనాడు ప్రకటించింది.కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం.07215)ను జనవరి 18న నడపనుంది. అలాగే నర్సాపూర్ – చర్లపల్లి ప్రత్యేక రైలును జనవరి 19న, విశాఖపట్నం – చర్లపల్లి ప్రత్యేక రైలును జనవరి 18న రెండు సర్వీసులు, 19 తేదీన ఒక సర్వీసు, చర్లపల్లి – విశాఖపట్నం ప్రత్యేక రైలును జనవరి 19, 20 తేదీన నడపనుంది. చర్లపల్లి – భువనేశ్వర్ ప్రత్యేక రైలును జనవరి 19న రైల్వే శాఖ నడపనుంది.

ప్రత్యేక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్లు
కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి నిడదవోలు, తణుకు, భీవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగామ స్టేషన్లలో ఆగనుంది.


నర్సాపూర్ – చర్లపల్లి ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, జనగామ స్టేషన్లలో ఆగనుంది.
విశాఖపట్నం – చర్లపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనున్నాయి.
చర్లపల్లి – భువనేశ్వర్ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట్, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగాన్, ఖర్దా రోడ్ స్టేషన్లలో ఆగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com